News January 30, 2025
KTDM: ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొదలైన కోలాహలం

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో కోలాహలం మొదలైంది. కాగా ఇటీవలే ఈ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తైంది. కొత్తగూడెం జిల్లాలో 23 మండలాల పరిధిలో 23 పోలింగ్ బూత్ల పరిధిలో 1,949 మంది ఓటర్లుగా తేలారు. ఇందులో పురుషులు 1,038 మహిళలు 941 మంది ఉన్నారు. ఈ నెల 31 వరకు ఓటు నమోదుకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News December 23, 2025
పీవీ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త దిశగా మలిచిన మహోన్నత నాయకుడిగా పీవీ చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే నేటి అభివృద్ధికి పునాదిగా మారాయన్నారు. పీవీ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
News December 23, 2025
గోవిందరాజస్వామి ఆలయంపై 30 విగ్రహాలు తొలగించారు..?

గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న విగ్రహాలను బంగారు తాపడం పనుల నేపథ్యంలో తొలగించారు. అనేక దేవతామూర్తుల విగ్రహాలు నేడు కనిపించడం లేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై హై కోర్టులో కూడా తప్పుడు నివేదికలు సమర్పించారని అంటున్నారు. ఇదంతా ఆనాటి అధికారులు, అర్చకులు, జీయర్ స్వాములతో సహా ముఖ్యులు తెలిసే జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News December 23, 2025
Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.


