News January 28, 2025
KTDM: కేసుల విచారణలో జాప్యం చేయొద్దు: SP

కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్షపడే విధంగా చూడాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Similar News
News December 6, 2025
అవినీతి నిర్మూలనకు మాతో కలిసి నడవండి: ఎస్పీ

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వారోత్సవాల సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడానికి ప్రజలు పోలీసులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.
-SHARE IT
News December 6, 2025
చరిత్ర సృష్టించిన డికాక్

మూడో వన్డేలో భారత్పై సెంచరీ చేసిన(83 బంతుల్లో 106) డికాక్ అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే టీమ్పై అత్యధిక సెంచరీలు(7) చేసిన వికెట్ కీపర్గా నిలిచారు. ఆ తర్వాత గిల్క్రిస్ట్(6)vsSL, సంగక్కర(6)vsIND ఉన్నారు. అలాగే వన్డేల్లో అత్యధిక శతకాలు(23) బాదిన వికెట్ కీపర్గా సంగక్కర సరసన చేరారు. అలాగే భారత్పై హయ్యెస్ట్ సెంచరీలు(7) చేసిన ప్లేయర్గా జయసూర్యతో సమానంగా నిలిచారు.
News December 6, 2025
మూడో విడతలో 27,277 నామినేషన్లు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.


