News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News February 24, 2026
ఆర్యూబీ నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
News February 24, 2026
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ములుగు జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 10 కేంద్రాలు ఏర్పాటు చేసి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు నియమించామన్నారు. ప్రత్యేక బస్సులు, పోలీస్ బందోబస్తు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
News February 24, 2026
మస్కట్ నరకం నుంచి విముక్తి.. క్షేమంగా కోనసీమకు!

మస్కట్లో తీవ్ర ఇబ్బందులు పడ్డ తాటిపాకకు చెందిన కర్రీ సౌజన్య, కందికుప్పకు చెందిన బొజ్జ లక్ష్మీదుర్గ మంగళవారం క్షేమంగా స్వగ్రామం చేరారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ పని దొరకక అవస్థలు పడుతున్న వీరిని కలెక్టర్ మహేశ్ కుమార్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా రప్పించారు. కుటుంబ సభ్యులు కలెక్టర్ ను ఆశ్రయించడంతో అధికారులు స్పందించి వారిని సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చారు.


