News March 19, 2024

KTDM: ప్రిన్సిపల్‌ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన..!

image

ప్రిన్సిపల్‌, సహాయకులు విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్‌ విద్యార్థినులుండే హాస్టల్‌కు రాత్రివేళ సిబ్బందితో వచ్చి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ వివరణిస్తూ.. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు.

Similar News

News February 11, 2025

మధిర: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్ 

image

మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 11, 2025

సత్తుపల్లి: కరెంట్ షాక్‌తో మహిళ మృతి 

image

కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన పానెం సరస్వతి (50) బట్టలు ఉకితి ఆరేస్తోంది. ఈ క్రమంలో ఐరన్ దండానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్‌కు గురైంది. దీంతో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. ఆమె భర్త 2 నెలల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

News February 11, 2025

కొత్తగూడెం: అత్యాచారయత్నం.. తప్పించుకున్న యువతి

image

అనిశెట్టిపల్లి వద్ద <<15422949>>రాత్రి <<>> అక్కడి గ్రామస్థులకు ఓ యువతి లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. CGకి చెందిన యువతి(20) కొత్తగూడెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ కూలీపనులు చేస్తోంది. ఉదయం ఓ ఆటోడ్రైవర్ పని ఇప్పిస్తానని ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సహకరించకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి గ్రామస్థులకు విషయం తెలిపింది. కేసు నమోదైంది.

error: Content is protected !!