News November 15, 2025
KTDM: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా పోలీసులు!

మావోయిస్టు ప్రాంత ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ చెప్పారు. చర్ల మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలైన బక్కచింతలపాడు, కిష్టారంపాడు, వీరాపురం, రాళ్లపురం, తిమ్మిరిగూడెం, కమలాపురంలో పర్యటించి సూచనలు చేశారు.
Similar News
News November 15, 2025
నీ వాటా ఎంత పవన్ కళ్యాణ్: వైసీపీ

యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. ‘పవన్ పీఏ, జనసేన ఎమ్మెల్యే మధ్య పంపకాల్లో తేడాలు, రూ.350 కోట్లు విలువైన భూమిని సెటిల్మెంట్ చేసిన పవన్ పీఏ.. వాటా కోసం ఎగబడిన యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. బాధితుల్ని గాలికి వదిలేసి.. గుట్టుచప్పుడు కాకుండా సయోధ్యకి పవన్ ప్రయత్నిస్తున్నారు’. ఇందులో నీ వాటా ఎంత అంటూ పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేసింది.
News November 15, 2025
ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.
News November 15, 2025
ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.


