News March 27, 2025
KTDM: కేసీఆర్ పాలనలో రైతులకు మేలు: నిర్మలమ్మ

MP వద్దిరాజు రవిచంద్ర బుధవారం రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడారు. TG తొలి సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేసి వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని వివరించారు. కాగా, దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా స్పందిస్తూ.. కేసీఆర్ పాలనలో రైతులు, వ్యవసాయ రంగానికి మేలు జరిగిన మాట నిజమేనన్నారు. అయితే, కాంగ్రెస్ 2008-09లో రైతు రుణ మాఫీ గురించి హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు.
Similar News
News November 13, 2025
17కు చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్ వాయిదా

కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ ఈనెల 17కు వాయిదా పడింది. నెల్లూరు సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరగ్గా.. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందనన్నారు. మరో వైపు సీబీఐ అధికారులు సైతం కస్టడీ పిటిషన్ వేశారు. 17న కస్టడీ లేదా బెయిల్ పిటిషన్పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
News November 13, 2025
తెలంగాణ ముచ్చట్లు

* ఉన్నతాధికారులు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దని హెడ్మాస్టర్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
* ఫిరాయింపు MLAలను రేపు, ఎల్లుండి అసెంబ్లీలోని కార్యాలయంలో విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 34,023 మందికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగు దొడ్లు మంజూరు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో టాప్-3లో జనగాం, ఖమ్మం, యాదాద్రి.. నిర్మాణ పనుల్లో 70% పురోగతి
News November 13, 2025
భారత్ సమ్మిట్.. ఆకర్షణీయంగా భద్రాద్రి ఉత్పత్తులు

HYD శిల్పకళా వేదికలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో భద్రాద్రి జిల్లా ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో గిరిజన, SHG మహిళలు, MSME యూనిట్లు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, పిండివంటలు, హస్తకళా వస్తువులకు విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఇప్పపువ్వు లడ్డూ, బర్ఫీ, టీ పొడి, పొంగర్ పచ్చళ్లు, కరక్కాయ పొడి ఆకర్షణగా నిలిచాయి.


