News March 27, 2025

KTDM: కేసీఆర్ పాలనలో రైతులకు మేలు: నిర్మలమ్మ

image

MP వద్దిరాజు రవిచంద్ర బుధవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. TG తొలి సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేసి వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని వివరించారు. కాగా, దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా స్పందిస్తూ.. కేసీఆర్ పాలనలో రైతులు, వ్యవసాయ రంగానికి మేలు జరిగిన మాట నిజమేనన్నారు. అయితే, కాంగ్రెస్ 2008-09లో రైతు రుణ మాఫీ గురించి హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు.

Similar News

News September 19, 2025

మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

image

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

News September 19, 2025

RG-3: యాజమాన్యం మొండి వైఖరి వల్లే సమావేశం బహిష్కరణ

image

సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని ఏఐటియుసి బహిష్కరించారని జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్ అన్నారు. గురువారం RG-3 ఏరియా OCP-2లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయాలని, కార్మికులకు 35శాతం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైవీ రావు,MRC రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

YSR మరణంతోనే రాష్ట్ర విభజన: రాజగోపాల్‌రెడ్డి

image

YSR మరణంతోనే రాష్ట్ర విభజన జరిగిందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వెనుక ఇంటెలిజెన్స్ ఉందని, నేను పార్టీ మారుతున్నానని, మాజీ CM జగన్‌ను కలుస్తున్నానని కొందరు ప్రచారం చేశారు. నేను రాజకీయ నాయకుడిగా కాకుండా, సోదరుడిగా APకి వచ్చాను. నేను YSR అభిమానినని, ఒక మనిషి మరణిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు’ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.