News January 28, 2025

KTDM: కేసుల విచారణలో జాప్యం చేయొద్దు: SP

image

కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్షపడే విధంగా చూడాలని పోలీసులకు ఎస్పీ సూచించారు.  బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Similar News

News September 19, 2025

సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

image

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్‌ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.

News September 19, 2025

వృద్ధుల సంక్షేమంపై ములుగు ఆర్డీఓ కీలక సూచనలు

image

వయోవృద్ధులు తమ ఆస్తిని బదలాయించేటప్పుడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ‘పోషణ, సంక్షేమం’ నిబంధనలను తప్పకుండా పొందుపరచాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. ఆస్తి పొందినవారు నిబంధనలు పాటించకపోతే, వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఆస్తిని రద్దు చేసే అధికారం ఉంటుందని తెలిపారు.

News September 19, 2025

మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

image

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.