News March 1, 2026

KTDM: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్’

image

భద్రాచలం వ్యాపారి కంభంపాటి శ్రీనివాస్ కుమారుడు జశ్వంత్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంబీఏ పూర్తి చేసిన జశ్వంత్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన అతను.. “నా చావుకు ఎవరూ బాధ్యులు కారు, కేవలం జాబ్ టెన్షన్ వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నా” అని తన సోదరుడికి వాట్సప్‌లో మెసేజ్ పంపాడు. ఆందోళనతో కుటుంబ సభ్యులు గాలించగా, చివరకు నదిలో అతని మృతదేహం లభ్యమైంది.

Similar News

News March 2, 2026

ములుగు ప్రజావాణిలో 59 వినతులు

image

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి 59 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, పింఛన్ల కోసం 14, ఉద్యోగ కల్పనకు 4, ఇతర సమస్యలపై 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదన్నారు.

News March 2, 2026

KMR: రాహుల్ గాంధీ మూటల కోసం వచ్చారు: కేంద్ర మంత్రి

image

రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల పేరుతో హైదరాబాద్‌కు వచ్చింది కేవలం మూటల కోసమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ సుందరీకరణ కోసం ఇండ్లను కూల్చివేసిన బాధితుల ఇండ్ల వద్దకు రాహుల్ గాంధీ వెళ్లాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల ప్రాంతాలను, ఖమ్మంలోని ప్రాంతాలను సందర్శించాలన్నారు.

News March 2, 2026

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

image

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు