News July 22, 2024

KTDM: మద్యం మత్తులో పురుగుల మందు తాగి సూసైడ్

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.. ఎస్సై తిరుపతి రావు తెలిపిన వివరాలు ప్రకారం.. వీరభద్ర వరంలో మునిగెల శ్రీనివాస్ (55) మద్యానికి పూర్తిగా బానిస అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించగా పురుగుల మందు తాగాడని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు.

Similar News

News September 9, 2025

ఖమ్మం: నత్తనడకన రోడ్ల విస్తరణ పనులు

image

ఖమ్మం నగరం సుందరీకరణ, ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చాలా వరకు సగంలోనే మిగిలిపోయాయి. రిక్కాబజార్, చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు, PSR రోడ్డు, RTA కార్యాలయ రోడ్ల విస్తరించేందుకు పనులను ప్రారంభించగా.. వీటిలో కొన్ని రోడ్లు వెడల్పు చేయకుండానే నిలిచిపోయాయి. ఇలాగైతే పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
∆} ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
∆} కూసుమంచి: విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు సొసైటీలో యూరియా సరఫరా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News September 9, 2025

ఖమ్మం: పోక్సో కేసుల్లో నిందితులు తప్పించుకోలేరు: డీసీపీ

image

18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో చట్టం కఠినంగా అమలవుతోందని, నిందితులు తప్పించుకునే అవకాశం లేదని అదనపు డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన భరోసా కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి మాట్లాడుతూ.. పోక్సో కేసుల్లో రాజీకి అవకాశం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు పడతాయని తెలిపారు.