News January 8, 2025

KTRలో భయం మొదలైంది: మహేశ్ కుమార్

image

KTRలో భయం మొదలయ్యిందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డిచ్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి దాకా దమ్ముంటే అరెస్ట్ చేయండి.. జైలుకు వెళ్తా అని బీరాలు పలికిన KTR ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ కేసు కొట్టివేయాలని KTR హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ కొట్టివేయడంతో ఆయనలో భయం మొదలైందన్నారు.

Similar News

News December 16, 2025

NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.

News December 16, 2025

3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

News December 16, 2025

NZB: తుది దశలో మహిళా ఓటర్లే కీలకం

image

NZB జిల్లాలో తుది దశలో జరిగే కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జయాపజయాలు ప్రభావితం చేసేది మహిళా ఓటర్లే. మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు.