News July 9, 2025
KTRతో చర్చకు భయపడి CM రేవంత్ పరార్: జీవన్ రెడ్డి

తెలంగాణ రైతాంగానికి ఎవరేం చేశారో తేల్చుకుందామని సవాల్ చేసిన CM రేవంత్ రెడ్డి.. మాటకు కట్టుబడకుండా ఢిల్లీకి పారిపోయాడని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం ఉపముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ చర్చకు రావాలని కేటీఆర్ కోరినా రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనమన్నారు.
Similar News
News September 10, 2025
నిజామాబాద్: వృద్ధురాలి హత్య

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 10, 2025
NZB: కళాశాలకు హాజరు కాని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: DIEO

ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్లోనే హాజరు తీసుకోవాలని DIEO తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల, బోధనేతర సిబ్బందితో సమీక్షించారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కానీ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News September 10, 2025
NZB: వాగులో గుర్తు తెలియని మృతదేహం

నిజామాబాద్ బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వారు 4వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 35-40 ఉంటుందని పోలీసులు చెప్పారు. కాగా మృతుడు ఆత్మహత్య చేసుకొన్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.