News October 25, 2024

కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది: ఆది శ్రీనివాస్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అన్ని పథకాల్లో అవినీతి చేసి ఉత్తర కుమారుడిలా KTR ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. నాలుగు రోజులు ఆగితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఇకపై తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించబోరని పేర్కొన్నారు.

Similar News

News October 25, 2024

సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ఇదే..

image

నవంబర్ 8 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులు గల భారత జట్టును BCCI ప్రకటించింది. నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో సౌతాఫ్రికాలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
జట్టు: సూర్య(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూసింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్, అక్షర్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్

News October 25, 2024

ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. షమీకి నో ఛాన్స్

image

ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి 18 మందితో స్క్వాడ్‌ను BCCI ప్రకటించింది. జట్టులోకి వస్తాడనుకున్న షమీకి చోటు దక్కలేదు. నితీశ్ కుమార్‌ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ ఛాన్స్ కొట్టేశారు.
జట్టు: రోహిత్(కెప్టెన్), బుమ్రా(VC), జైస్వాల్, అభిమన్యు, రాహుల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్, గిల్, జురెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్.

News October 25, 2024

పవన్‌తో ములాఖత్ విషయాలు పంచుకున్న చంద్రబాబు

image

AP: జైలులో ఉన్న సమయంలో తనతో పవన్ కళ్యాణ్‌‌ ములాఖత్ అయినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ పరిస్థితుల్లో తాను ధైర్యంగానే ఉన్నానని, పవన్‌ను ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు అన్‌స్టాపబుల్ షోలో పేర్కొన్నారు. కూటమి పొత్తు ప్రతిపాదన తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వెంటనే పవన్ ఆలోచించి ఓకే చెప్పారన్నారు. ఆ తర్వాత పవన్ కూటమి ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు. అదే విజయానికి నాంది అని అన్నారు.