News October 18, 2024

మంత్రి సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

image

TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు కేటీఆర్ సోమవారం నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం మూసీపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది పునరుజ్జీవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించనున్నారు.

Similar News

News October 18, 2024

RETAIL INVESTORSది ట్రాపా? స్ట్రాటజీనా?

image

స్టాక్ మార్కెట్లో రాబడి పూలపాన్పు కాదు. లాసెస్, ప్రెజర్ తట్టుకోవాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు సైకలాజికల్ ఎడ్జ్, కన్విక్షన్, సహనం లేకుంటే నష్టపోవడం ఖాయం. చిన్న ఇన్వెస్టర్లు పెద్ద చేపల ట్రాప్‌లో పడటానికి ఇదే రీజన్. SEP క్వార్టర్లో 56PSU షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్లు వాటా పెంచుకోవడం ట్రాప్ అని కొందరు, వాటిని డిప్స్‌లో కొనడం మంచిదేనని మరికొందరు అంటున్నారు. ఏది నిజమవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

News October 18, 2024

సద్గురుకు సుప్రీంకోర్టులో ఊరట.. కేసు కొట్టివేత

image

సద్గురు/జగ్గీ వాసుదేవ్‌కు ఊరట లభించింది. బ్రెయిన్‌వాష్ చేసి తమ కుమార్తెలను ఈశా యోగా సెంటర్లోనే ఉంచుతున్నారని ఓ తండ్రి వేసిన <<14260998>>HCPని<<>> సుప్రీంకోర్టు కొట్టేసింది. తామిద్దరం మేజర్లమని, ఇష్టంతోనే అక్కడ ఉంటున్నామని, ఆశ్రమం నుంచి బయటకెళ్లే స్వేచ్ఛ తమకుందన్న కుమార్తెల వాంగ్మూలాలను కోర్టు నోట్‌ చేసుకుంది. ఈశా సెంటర్ పాటించాల్సిన ఇతర రూల్స్‌పై ఈ కేసు క్లోజింగ్ ప్రొసీజర్స్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

News October 18, 2024

‘గేమ్ ఛేంజర్’ సాంగ్‌కు రూ.20 కోట్ల ఖర్చు?

image

తన సినిమాల్లోని సాంగ్స్‌కు రూ.కోట్లు ఖర్చు పెట్టడం శంకర్ స్పెషాలిటీ. కనువిందు చేసే సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్‌తో ప్రేక్షకుడిని మైమరిపించేందుకు ఆయన వెనకాడరు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ తీస్తున్నారు. అయితే, అందులో ఓ మెలోడీ సాంగ్ కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదిరిపోయే లొకేషన్స్‌లో కియారా, చరణ్ మధ్య సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందని సమాచారం.