News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
NGKL: ముగిసిన మూడో విడత పోలింగ్

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, చారకొండ, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, లింగాల మండలాల్లోని 158 గ్రామాల్లో మూడో విడత స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ సిబ్బంది గేట్లను మూసివేశారు. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
News December 17, 2025
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు: పెద్దపల్లి డీసీపీ

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు PDPL జోన్ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DCP రామ్ రెడ్డి తెలిపారు. పొత్కపల్లి, మడక, ఓదెల, కొలనూరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక బృందాలు నిరంతరం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు.
News December 17, 2025
కరీంనగర్: ముగిసిన మూడో పోరు.. విజేత ఎవరో..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 388 GPలకు, 1580 వార్డులకు జరిగిన మూడో పోరు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. 25 ఓట్లను ఓ కట్టగా కట్టి, ఆ తర్వాత వార్డుల వారీగా లెక్కించనున్నారు. వార్డులు ముగిసిన వెంటనే సర్పంచ్ కౌంటింగ్ పూర్తి చేస్తారు. అనంతరం ఉప సర్పంచ్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.


