News March 24, 2025
KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..!

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయన్న చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపు తగాదాలను ఆపకుంటే పార్టీకి భారీ నష్టం తప్పదని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
ములుగు: మండలాల వారీగా వడ్డీ లేని రుణాల పంపిణీ ఇలా..!

రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ములుగు జిల్లాలో రూ.2.7కోట్లను మహిళా పొదుపు సంఘాలకు ఈరోజు అందజేసింది. ఏటూరునాగారంలో రూ.21.89లక్షలు, గోవిందరావుపేటలో రూ.28.46లక్షలు, కన్నాయిగూడెంలో రూ.3.58లక్షలు, మంగపేటలో రూ.49.74, ములుగులో రూ.59.65లక్షలు, తాడ్వాయిలో రూ.5.19 వెంకటాపూర్లో రూ.21.84లక్షలు, వాజేడులో రూ.2.81లక్షలు, వెంకటాపురంలో రూ.13.84 లక్షల రుణాలు ఇచ్చారు.


