News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Similar News
News October 31, 2025
NLG: నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ

సికింద్రాబాద్ నుంచి BNG మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మొంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను NLG రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు BNG మీదుగా వెళ్లే అవకాశం ఉంది.
News October 31, 2025
వెంకటగిరి: బాలికపై లైంగిక దాడి.. మారుతండ్రికి జీవిత ఖైదు

బాలికపై మారు తండ్రి పలుమార్లు లైంగిక దాడి చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సర్వేపల్లి అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వెంకటగిరి బంగారు పేట అరుంధతి పాలేనికి చెందిన సర్వేపల్లి అంజయ్యకు ఓ వివాహితతో పరిచయం ఏర్పండి. ఈ క్రమంలో ఆమెతో ఉంటూ మహిళ 15 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2021 జులై 19న కేసు నమోదైంది.
News October 31, 2025
నిజామాబాద్కు నిరాశే

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. షబ్బీర్ అలీకి మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కవచ్చని జిల్లా నాయకులు ఆశలు పెట్టుకోగా అధిష్ఠానం అజారుద్దీన్ పేరు ప్రకటించింది. ఆయనతో పాటు బోధన్ MLA సుదర్శన్ రెడ్డి పేరు కూడా లేకపోవడంతో ఇద్దరికీ నిరాశే మిగిలింది. డిసెంబర్లో మరోసారి క్యాబినెట్ విస్తరణ జరగవచ్చని.. అప్పుడైనా పదవి దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది.


