News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News September 19, 2025

VZM: స్పీకర్‌తో మహిళ ప్రజా ప్రతినిధుల భేటీ

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశాల ప్రాధాన్యం, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై వారు చర్చించారు. సభా కార్యక్రమాలు విజయవంతంగా సాగేలా సహకారం అందిస్తామని తెలిపారు.

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.

News September 19, 2025

కెరమెరిలో చెక్‌పోస్ట్ తనిఖీ

image

కెరమెరి మండలం ఎస్సాపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌ను ఈరోజు ఎఫ్ఆర్ఓ మజహరుద్దీన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన ఆయన చెక్‌పోస్ట్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని రికార్డులు నమోదు చేయాలన్నారు. స్మగ్లర్లు వర్షాకాలాన్ని అదునుగా చేసుకొని స్మగ్లింగ్ పెంచే ప్రమాదం ఉందని, సిబ్బంది ప్రత్యేక నిఘాపెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు.అడవి, వన్యప్రాణులను నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.