News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట

image

భారతీయ సంప్రదాయంపై నమ్మకంతో ఇటలీ నుంచి వచ్చిన జంట కాశీలో వివాహం చేసుకున్నారు. పెళ్లి కూతురు యాంటీలియా, పెళ్లి కొడుకు గ్లోరియస్ సనాతన సంప్రదాయం ప్రకారం నవదుర్గ ఆలయంలో ఒక్కటయ్యారు. ఆచార్య మనోజ్ మంత్రాలు చదువుతుండగా ఈ జంట దండలు మార్చుకుని, బొట్టు పెట్టుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచింది. ఏడాది క్రితం వీరు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నపట్పికీ ఇప్పుడు భారతీయ సంప్రదాయంలో వివాహమాడటం గమనార్హం.

News November 12, 2025

విజయవాడ: రోగులు ఫుల్.. సిబ్బంది నిల్..!

image

విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగలకు కలిపి 85 మంజూరు పోస్టులు ఉండగా కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి రోగులు అనేక మంది వస్తున్నారని, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అపాయింట్మెంట్ తీసుకొని మరి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు వస్తున్నారని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.

News November 12, 2025

HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPCC

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.