News March 24, 2025
KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
News March 26, 2025
నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాత ఆజంజాహీ మిల్ గ్రౌండ్లో 16.7 ఎకరాలలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న జీ ప్లస్ టూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News March 26, 2025
వరంగల్: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

మామూనూర్ ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు, భూముల అవార్డింగ్ పాస్ అయిన వారికి డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.