News September 11, 2025
KU పీజీ ఫలితాలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్) 4వ సెమిస్టర్ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్ ఏప్రిల్, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ జూన్, ఎంఏ(ఇంగ్లిష్) మొదటి సెమిస్టర్ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాల కోసం www.kuexams.org యూనివర్సిటీ వెబ్సైట్ను విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News September 11, 2025
ఐశ్వర్యారాయ్ AI ఫొటోస్ తొలగించండి: ఢిల్లీ HC

ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, AI మార్ఫ్డ్ ఫొటోస్ను అడల్ట్ సైట్స్లో వాడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు 72 గంటల్లో సంబంధిత సైట్స్, URLsను తొలగించి సదరు ఆపరేటర్ల వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇది ఆమె పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది.
News September 11, 2025
HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

సచివాలయంలో ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News September 11, 2025
MBNR: వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలి- శ్రీనివాస్ గౌడ్

వాకిటి శ్రీహరికి ప్రాధాన్యంలేని మత్స్యశాఖ కట్టబెట్టి నిధులు ఇవ్వడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ లేదా హోంశాఖ కేటాయిస్తే బాగా పనిచేస్తారన్నారు. గురువారం HYDలోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ముదిరాజ్లను బీసీ ఏ గ్రూప్లో చేరుస్తామని మోసం చేస్తున్నారన్నారు. CM, పీసీసీ ప్రెసిడెంట్ చర్చించి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలకు GO ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.