News March 24, 2025

KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

image

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News December 27, 2025

డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!

image

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో భారీగా కొకైన్, MDMA సీజ్ చేశారు. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అమన్ పరారైనట్లు సమాచారం.

News December 27, 2025

ఇక తక్కువ అద్దెకే రైతుకు సాగు పరికరాలు

image

AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు తక్కువ ఖర్చుతో సాగుకు అవసరమయ్యే పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు CHC(కస్టమ్ హైరింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 300 CHCల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక్కడ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు, భూసార పరీక్షలు చేసే కిట్స్, మినీ రైస్ మిల్లు, ఇతర పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు అందిస్తారు.