News January 29, 2025
కుంభమేళా తొక్కిసలాట బాధాకరం: పవన్ కళ్యాణ్

AP: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆ ఘటన దురదృష్టకరం. 20మంది భక్తులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. చాలా బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 27, 2025
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏ గ్రామాల మీద వెళ్తుందో తెలుసా..!

ఆమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి NHAI మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. దీని ద్వారా 9 గ్రామాల్లో మొత్తం 1,173 ఎకరాల భూమి సేకరిస్తారు. లింగాపురం, ధరణికోట, ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్ పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు గ్రామాలలో భూ సేకరణకు రంగం సిద్ధం అవుతుంది. అమరావతి ఓఆర్ఆర్ 189.4 కిలోమీటర్ల పొడవు, ఆరు లైన్లతో ఐదు జిల్లాల మీదగా వెళ్తుంది.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<


