News September 7, 2024
గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకంటే…

వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
Similar News
News February 3, 2026
మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.
News February 3, 2026
ICMR 27 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (<
News February 3, 2026
Trade Deal: మనపై 18% టారిఫ్స్.. వాళ్లపై ‘సున్నా’ సుంకాలా?

ట్రేడ్ డీల్లో భాగంగా US వస్తువులపై ఇండియా సున్నా టారిఫ్స్ విధిస్తుందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. దీనిపై భారత ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. ఒకవేళ చేసినా.. వేటికి జీరో టారిఫ్స్ వర్తిస్తాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బహుశా కొన్ని సెలక్టెడ్ అమెరికన్ ప్రొడక్ట్స్పై దశలవారీగా సుంకాలు భారీగా తగ్గిస్తామన్న హామీ లభించిందని ట్రంప్ ఉద్దేశం అయి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.


