News September 7, 2024
గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకంటే…

వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
Similar News
News February 2, 2026
విశాఖ రైల్వే జోన్పై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సిబ్బంది, కంట్రోల్ కమాండ్స్, టైం టేబుల్.. ఇలా అన్నింటినీ మార్చాల్సి ఉందన్నారు. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో నాలుగేళ్ల వరకు పట్టేదని, తాము చాలా వేగంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏపీకి రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ.5,454 కోట్ల నిధులు, ప్రాజెక్టులు కేటాయించామని పేర్కొన్నారు.
News February 2, 2026
805 పోస్టులకు నోటిఫికేషన్

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(C-DAC) 805 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంటెక్, పీజీ, PhD ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News February 2, 2026
గ్రామీ వేడుకల్లో ఇండియన్ టచ్

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ కెల్సియా బాలేరిని డిజైనర్ సబ్యసాచి చెవి రింగులు, ఉంగరం ధరించగా, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి సబ్యసాచి శారీని ధరించారు. భారతీయ, శ్రీలంక మూలాలు కలిగిన సింగర్ లారా రాజ్ ఓం లాకెట్తో పాటు పాపిడి బిళ్ల ధరించి మెరిసిపోయారు.


