News September 7, 2024
గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకంటే…

వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
Similar News
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు(D)లో గ్రీన్ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుచేయనున్నట్లు ‘బిర్లాన్యూ’ వెల్లడించింది. తొలి దశలో ₹127Cr వెచ్చిస్తామని, 600 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
* పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు PPP విధానాన్ని అనుసరిస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. 2029 నాటికి ₹66000Cr పెట్టుబడులు సమీకరిస్తామంది.
* తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు: తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ విల్సన్


