News September 27, 2024
ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం

AP: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అటవీ అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. కుంకీ ఏనుగులు శిక్షణ పొంది ఉంటాయి. అడవి ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో సంచరించే వాటిని తిరిగి అడవిలోకి తీసుకెళ్తాయి.
Similar News
News January 19, 2026
రేపు ఆటోల బంద్.. క్లారిటీ

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
News January 19, 2026
సిట్ విచారణకు హాజరవ్వాలని హరీశ్ నిర్ణయం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18900983>>నోటీసుల<<>> నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఆయన తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. అక్కడ పలువురు బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్కు బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతారు.
News January 19, 2026
రెవెన్యూ లోటుతో ఉక్కిరిబిక్కిరి

మూడేళ్లుగా APని రెవెన్యూ లోటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కమిటెడ్ వ్యయం పెరగడం, పన్నేతర ఆదాయం తగ్గడం దీనికి కారణమని కాగ్ నివేదిక పేర్కొంటోంది. FY25-26 NOV నాటికి ₹54355 CR రెవెన్యూ లోటు ఉంది. ఈ లోటు 2024లో ₹56805 CR, 2023లో ₹47063 CRగా ఉంది. దీని భర్తీకి అప్పులు చేయక తప్పడం లేదు. రుణాల్లో 80% శాలరీ, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చుకే సరిపోతుండగా క్యాపిటల్ వ్యయం అంతంతే.


