News March 17, 2024
కర్నూలు: ఒకే రోజు 24 పోటీలు.. విజయం సాధించిన జట్లు ఇవే..
ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఒకే రోజు జరిగిన 24 పోటీల్లో శ్రీకాకుళంపై రాయలసీమ యూనివర్సిటీ, జై నారాయణ వ్యాస్ విశ్వ విద్యాలయంపై కొచ్చిన్ విశ్వవిద్యాలయం, జైపూర్ నిర్వాణ విశ్వ విద్యాలయంపై యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, మాధవ్ యూనివర్సిటీ పింద్వరాపై మౌలానా ఆజాద్ జోడ్పూర్ విజయం సాధించాయి.
Similar News
News July 5, 2024
రేపు జడ్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు అందని సమాచారం
కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
News July 5, 2024
కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
News July 5, 2024
డా.సుధాకర్పై పోక్సో కేసు నమోదు
బాలికపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 376తో పాటు బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్విత్ 5(ఎల్) కింద కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.