News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

AP: కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదంపై<<>> రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.
Similar News
News February 15, 2026
ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో ఈ నెల 17వ తేదీ రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. 3.26pm-7.57pm వరకు గ్రహణం ఉంటుంది. అయితే భారతదేశం నుంచి దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్కిటికా ఖండం నుంచి స్పష్టంగా కన్పిస్తుంది. సాధారణంగా సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ టైమ్లో చంద్రుడు సైజు చిన్నగా కనిపించడంతో సూర్యుడి అంచులు రింగ్లా దర్శనమిస్తాయి.
News February 15, 2026
పవర్ ప్లేలో భారత్ స్కోర్ 52-1

T20WC: తొలి ఓవర్లోనే అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్(42*) ధనాధన్ ఆటతో భారత్ పవర్ ప్లే ముగిసే వరకు 52 పరుగులు చేసింది. అటు తిలక్ వర్మ(10*) ఆచితూచి ఆడుతున్నారు. తొలి 6 ఓవర్లలో 5 ఓవర్లను పాక్ స్పిన్నర్లతోనే వేయించడం విశేషం.
News February 15, 2026
మహా శివరాత్రి జాగరణ చేస్తున్నారా?

ఇవాళ మహాశివరాత్రి జాగరణ మనలోని శివత్వాన్ని మేల్కొలుపుతుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంటున్నారు. అయితే సినిమాలు చూస్తూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, డాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేస్తున్నారు. కునికిపాట్లు పడకుండా శివ నామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12.03 గంటల నుంచి 12.53 వరకు లింగోద్భవ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు.


