News April 28, 2024

మరో 2 వారాల్లో కురుక్షేత్రం: జగన్

image

AP: మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. ఎవరి పక్షాన ఉండాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే? ఆయన వస్తే పథకాలు అన్నీ రద్దవుతాయి. మరోసారి బాబు చేతిలో మోసపోయినట్లే. సాధ్యంకాని హామీలతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు. నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి. మరోసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కండి’ అని విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 27, 2025

TODAY HEADLINES

image

* విశాఖకు 790km, కాకినాడకు 780km దూరంలో మొంథా తుఫాన్
* తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు: CM CBN
* భారీ వర్షాలు.. APలో 20 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
* ఈనెల 30 నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో CM రేవంత్
* ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు: పొంగులేటి
* TGలో NOV 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్‌: ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య

News October 27, 2025

రేషన్‌ షాపుల్లో 20% అధిక నిల్వలు: మనోహర్

image

AP: తుఫాను నేపథ్యంలో MLS(మండల స్థాయి స్టాక్ కేంద్రాలు), రేషన్‌ షాపుల్లో 20% అధిక నిల్వలు ఉంచినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో 40% వరకు సరకు తరలింపు పూర్తయిందన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. 50 వేల టార్పాలిన్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లోని టార్పాలిన్లను రైతులు వాడుకోవచ్చని స్పష్టం చేశారు.

News October 27, 2025

బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు RTC గమనిక

image

కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో TGSRTC ప్రకటన జారీ చేసింది. ‘ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా లహరి, రాజధాని వంటి AC బస్సుల్లో వెనుక అత్యవసర ద్వారం, కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పే పరికరాలు, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడి వైపు, వెనుక భాగంలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటాయి. RTC బస్సుల్లో ప్రయాణం సురక్షితం’ అని ట్వీట్ చేసింది.