News April 23, 2025
KZR : మే 20లోపు ఏకరూప దుస్తుల పంపిణీ: DEO

మే 20 లోపు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నేడు కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాలను సందర్శించి, సకాలంలో దుస్తులను అందించాలన్నారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, నైపుణ్యాన్ని పరిశీలించారు.
Similar News
News April 24, 2025
TODAY HEADLINES

* ఉగ్రదాడి బాధితులకు రూ.10లక్షల పరిహారం: చంద్రబాబు
* హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్
* పహల్గామ్ ఉగ్రదాడి.. భారత్ సంచలన నిర్ణయం
* ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
* తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
* భారీగా తగ్గిన బంగారం ధర
* IPLలో SRH ఘోర పరాజయం
News April 24, 2025
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: రామ్మోహన్

కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖ ఎయిర్పోర్టులో ఎంతో బాధతో స్వీకరించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నివాళులు అర్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామన్నారు.
News April 24, 2025
బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.