News October 14, 2025
కొనుగోళ్లలో పత్తి రైతుకు దక్కని మద్దతు

AP: కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్కు పొడవు పింజ రూ.8,110, పొట్టి పింజ రూ.7,710గా నిర్ణయించారు. అయితే సోమవారం 16 వేల క్వింటాళ్ల మేర పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.7,419, కనిష్ఠంగా రూ.3,966కే కొన్నారు. మెజార్టీ పత్తిని క్వింటాకు రూ.5,500-రూ.5000 మధ్యే కొంటున్నారని రైతులు చెబుతున్నారు.
Similar News
News October 14, 2025
మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.
News October 14, 2025
ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్: లోకేశ్

విశాఖలో గూగుల్ <<18002028>>పెట్టుబడుల ఒప్పందం<<>> తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
News October 14, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్ అందిస్తోంది. ఇంటర్లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్సైట్: <