News November 16, 2024
లేడీస్ ‘ఫస్ట్’

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో మహిళా ఓటర్లే ఎక్కువశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పురుషుల కంటే 4.8శాతం ఎక్కువగా ఆడవారి ఓట్లే నమోదయ్యాయని తెలిపింది. కాగా ఈ నెల 13న జరిగిన పోలింగ్లో 66.66% పోలింగ్ నమోదైంది. 2019 పోలింగ్ కంటే 2.75శాతం అధికమని ఈసీ వివరించింది.
Similar News
News October 21, 2025
భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.
News October 21, 2025
నేడు..

* మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
* హైదరాబాద్లోని గోషామహల్లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో నివాళులు అర్పించనున్న టీజీ సీఎం రేవంత్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే ఆఖరు.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
* ఇవాళ WWCలో తలపడనున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్
News October 21, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ APలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.