News November 29, 2024
మోదీ పక్కన లేడీ కమాండో.. ఎవరామె?

PM మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫొటో వైరల్ అయింది. BJP MP కంగన ఇన్స్టాగ్రామ్లో ఫొటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్లో ఉంటారని, ఈ లేడీ కమాండో SPG కాదంది. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, అలాగే CRPF అసిస్టెంట్ కమాండెంట్ అని వివరించింది.
Similar News
News November 26, 2025
ఆనంద నిలయం విశేషాలివే..

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 26, 2025
రాజ్యాంగం@76 ఏళ్లు

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
News November 26, 2025
ప్రపంచకప్ తెచ్చిన కెప్టెన్ దీపిక గురించి తెలుసా?

తాజాగా అంధ మహిళలు టీ20 ప్రపంచకప్ విజేతలైన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని సత్యసాయి జిల్లాకు చెందిన చిక్కతిమ్మప్ప, చిత్తమ్మల కుమార్తె. కర్ణాటకలో చదివిన ఆమె 8వతరగతిలో క్రికెట్లో అడుగుపెట్టారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సెంచరీ చేశారు. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమవ్వగా అదే సమయంలో కర్ణాటక జట్టు కెప్టెన్గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.


