News November 18, 2024

లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్ల ఘటన: డీకే అరుణ

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. భూములు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రజావేదికను లగచర్ల ప్రజలు బహిష్కరించారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే లగచర్లలో దాడి జరిగిందని అన్నారు.

Similar News

News November 21, 2025

DWCWEOలో ఉద్యోగాలు

image

AP:బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bapatla.ap.gov.in/

News November 21, 2025

అరటి రైతుల ఆక్రందనలు పట్టట్లేదా: షర్మిల

image

AP: అరటి రైతుల ఆక్రందనలు కూటమి ప్రభుత్వానికి పట్టకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. అరటి టన్ను ధర రూ.28వేల నుంచి రూ.వెయ్యికి పడిపోయిందన్నారు. కిలో రూపాయికి అమ్ముకోలేక కష్టపడి పండించిన అరటిని పశువులకు మేతగా వేస్తుంటే రైతు సంక్షేమం ఎక్కడుంది? అని ఫైరయ్యారు. ప్రభుత్వం తక్షణమే రైతుల బాధలను వినాలని, టన్నుకు రూ.25వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

News November 21, 2025

రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి పయనం

image

మెడనొప్పితో బాధపడుతున్న టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ గిల్ సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.