News May 23, 2024
INDvsPAK మ్యాచ్ టికెట్ల ధరలపై లలిత్ మోదీ ఫైర్

టీ20 వరల్డ్ కప్లో టికెట్ల ధరలపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మండిపడ్డారు. ఐసీసీ తీరును ఆయన తప్పుబట్టారు. ‘జూన్ 9న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ టికెట్ ధర చూసి షాక్ అయ్యా. ఒక్కో టికెట్ 20 వేల డాలర్ల(రూ.16.6 లక్షలు)కు విక్రయిస్తున్నారు. అమెరికా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది లాభాల కోసం కాదు. గేమ్ విస్తరించడానికి. మామూలు టికెట్ ధర కూడా 2,750 డాలర్లు ఉండటం దారుణం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.
News November 24, 2025
టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్పై రవిశాస్త్రి ఫైర్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఫైరయ్యారు. రెండో టెస్టులో సుందర్ను ఎనిమిదో స్థానంలో పంపడం సరికాదన్నారు. ఈ ఆలోచన అర్థం లేనిదని మండిపడ్డారు. కోల్కతా(తొలి) టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒకరికి ఒకే ఓవర్ ఇవ్వడమూ సరైన నిర్ణయం కాదన్నారు. కనీసం స్పెషలిస్టు బ్యాటర్తో వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
News November 24, 2025
అద్దె ఇంట్లో ఏ దిశన పడుకోవాలి?

సొంత ఇల్లు/అద్దె ఇల్లు.. అది ఏదైనా ఆరోగ్యం కోసం తల దక్షిణ దిశకు, పాదాలు ఉత్తర దిశకు పెట్టి నిద్రించడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘ఈ దిశలో నిద్రించడం అయస్కాంత క్షేత్రాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దక్షిణ దిశలో నిద్రించడం సదా ఆరోగ్యకరమైన అలవాటు. తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం కూడా ఉత్తమమే’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


