News September 9, 2024

APకి ‘లలితా జ్యువెలరీ’ రూ.కోటి విరాళం

image

లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబుని స్వయంగా కలిసి చెక్కు అందజేశారు. అందరూ తోచినంత సహాయం చేయాలని ఆయన కోరారు. కాగా కిరణ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

Similar News

News November 18, 2025

చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

image

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.

News November 18, 2025

చెరకు సాగుకు భూమి తయారీ – సూచనలు

image

చెరకును నాటడానికి 4 వారాల ముందే పశువుల గెత్తం లేదా కంపోస్ట్ ఎరువును ఎకరానికి 10 టన్నుల చొప్పున వేసి భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని పెంచి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పంటలు భూమికి చేర్చడం వల్ల పంటకు భాస్వరం లభ్యత పెరగడమే కాకుండా, భూమికి నీటిని నిలుపుకునే శక్తి పెరిగి పంట బాగా ఎదగడానికి దోహదపడుతుంది.

News November 18, 2025

ఉద్యోగుల పనితీరుపై కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కన్ను

image

IT సంస్థలు హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నాయి. అయితే వారి పనితీరు తెలుసుకొనేలా ‘Cognizant’ ‘ప్రో-హాన్స్ స్టైల్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఇది మౌస్‌ను ట్రాక్ చేస్తుంటుంది. 300 సెకండ్లు కదలకపోతే ఐడల్‌గా, 15 ని.లు మించితే దూరంగా ఉన్నట్లు తెలుపుతుంది. వాడే అప్లికేషన్లనూ గుర్తిస్తుంది. కాగా ఇది సిబ్బంది పనితీరును అంచనా వేయడానికి కాదని, వినియోగం తెలుసుకొనేందుకేనని కంపెనీ చెబుతోంది.