News October 7, 2025
IPOకు లలితా జ్యువెలరీ

రూ.1700 కోట్ల సమీకరణ లక్ష్యంగా లలితా జ్యువెలరీ మార్ట్ PVT Ltd త్వరలో IPOకు రానుంది. ఇందులో ఫ్రెష్ ఈక్విటీ షేర్లతో రూ.1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్ల విలువైన షేర్స్ సెల్ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ కోసం జూన్లోనే సెబీకి అప్లై చేయగా ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ చెన్నై బేస్డ్ కంపెనీకి తమిళనాడులో 2 మాన్యూఫ్యాక్చర్ యూనిట్స్, సౌత్ సహా దేశంలో 56 బ్రాంచిలు ఉన్నాయి.
Similar News
News October 7, 2025
‘SSMB29’లో ప్రియాంకతో మహేశ్ మాస్ డాన్స్?

సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ ఫోక్ సాంగ్లో బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రాతో మహేశ్ స్టెప్పులేస్తారని సినీవర్గాల టాక్. ఈ సాంగ్కు కీరవాణి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనుండగా రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని సమాచారం. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సెట్లో సాంగ్ చిత్రీకరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
News October 7, 2025
గూగుల్ మ్యాప్స్లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
News October 7, 2025
నేడు చంద్రబాబుతో TTDP నేతల భేటీ

తెలంగాణ టీడీపీ నేతలకు అమరావతి నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయంత్రం టీటీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. అటు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ ఉంటుందా? లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.