News June 12, 2024

త్వరలో భూముల మార్కెట్ విలువ పెంపు?

image

TG: భూముల మార్కెట్ విలువను ఏ మేరకు పెంచవచ్చనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచే అవకాశం ఉండగా, అపార్టుమెంట్ల విలువను పెద్దగా పెంచకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ స్థలాల విషయానికి వస్తే HYD పరిసర జిల్లాల్లో వాస్తవ ధరలు ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట పెంపు ఉండొచ్చంటున్నారు.

Similar News

News January 15, 2026

రూ.1,499కే ఇండిగో విమాన టికెట్

image

విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది. ‘Sail into 2026’ పేరుతో దేశీయ రూట్లలో ఒకవైపు విమాన టికెట్ ధరను కేవలం రూ.1,499గా నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రారంభ ధర రూ.4,499గా వెల్లడించింది. ఈ ఆఫర్ ఈ నెల 16 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.

News January 15, 2026

NIA కొత్త సారథిగా రాకేశ్‌ అగర్వాల్‌ నియామకం

image

కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) కీలక భద్రతా విభాగాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. 1994 బ్యాచ్ IPL అధికారి రాకేశ్ అగర్వాల్‌ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా నియామకం అయ్యారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు వరకు కొనసాగనుంది. మరోవైపు హరియాణా మాజీ DGP శత్రుజీత్ సింగ్ కపూర్‌ను ITBP డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీ డీజీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌కు బీఎస్‌ఎఫ్ DGగా బాధ్యతలు అప్పగించింది.

News January 15, 2026

ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై దాడి ఖాయం!

image

ఇరాన్‌పై దాడి చేసే పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ఏ క్షణమైనా దాడి జరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల నుంచి వైమానిక దాడులు, సముద్ర మార్గం ద్వారా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ వార్, సీక్రెట్ ఆపరేషన్ లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు వంటి ఆప్షన్లు ఉన్నట్లు సమాచారం.