News November 25, 2024
గాలి నాణ్యతను బట్టి భూమి ధరను నిర్ధారించాలి: జెరోధా సీఈవో

కాలుష్యాన్ని తగ్గించాలంటే గాలి&నీటి నాణ్యతను బట్టి ఆ ప్రాంత భూమి ధరను నిర్ణయించేలా రూల్ తేవాలని జెరోధా CEO నితిన్ అభిప్రాయపడ్డారు. ‘ఇలా చేస్తే అక్కడున్న యజమానులంతా గ్రూప్గా మారి పర్యావరణంపై దృష్టి పెడతారు. నా అనే ఇల్లు గురించి ఆలోచిస్తేనే మన లేఅవుట్ పరిస్థితులు మారతాయి. AQIలో ఢిల్లీపైనే అందరూ దృష్టిసారించినా ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత పడిపోయింది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.