News December 17, 2024
రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

AP: రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూరిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగే అవకాశముంది. భూమి విలువల పెంచుతున్నట్లు కలెక్టర్ల ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం లభించగా, ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో సవరణ వివరాలు అంటించనున్నారు. 24 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. 27న పరిశీలన చేయనున్నారు. కొత్త ఏడాది నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
Similar News
News November 18, 2025
దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.
News November 18, 2025
దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.
News November 18, 2025
జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.


