News August 3, 2024
భూ రెవెన్యూ చట్టాలతో నష్టపోయింది ముస్లింలే: అక్బర్

TG: నిజాం పాలన ముగిసిన అనంతరం ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివిధ రెవెన్యూ చట్టాల వల్ల ముస్లింలే ఎక్కువగా నష్టపోయారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్లో ఇప్పుడున్న ఐఎస్బీ, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల భవనాలన్నింటినీ వక్ఫ్ బోర్డు స్థలాల్లోనే కట్టారు. ఐటీ పార్కు కోసం ల్యాంకో సంస్థకు భూమి ఇస్తే అందులో ఇళ్లు నిర్మించింది. చంచల్గూడ జైల్లోనూ 30 ఎకరాల భూమి వక్ఫ్దే’ అని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
AUSvsIND: అడిలైడ్లో అదరగొడతారా?

అడిలైడ్ వేదికగా టీమ్ ఇండియా ఇవాళ ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. సిరీస్లో నిలవాలంటే తొలి వన్డే ఓడిన గిల్ సేన ఈ మ్యాచులో తప్పక గెలవాలి. అటు కోహ్లీ, రోహిత్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు తొలి వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. దీంతో భారత్కు ఈ మ్యాచ్ కఠిన పరీక్ష కానుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.
News October 23, 2025
అన్నాచెల్లెళ్ల పండుగ.. శుభ సమయం ఏదంటే?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ పర్వదినాన, సోదరీమణుల చేతి భోజనం సోదరులకు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ దివ్య ఆచరణకు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం అని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ భగినీ హస్త భోజన ఘట్టాన్ని ఆచరించడానికి సమయం అనుకూలంగా ఉందంటున్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది.
News October 23, 2025
మామిడి పంటలో ఈ సమయంలో ఏం చేయాలి?

అక్టోబర్ రెండో పక్షంలో మామిడి చెట్టుకు పొటాషియం నైట్రేట్ (మల్టీ.కే లేదా 13-0-45 నీటిలో కరిగే ఎరువు) లీటరు నీటికి 10-15గ్రా మరియు ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. ఈ పోషకాలు పూమొగ్గలు ఏర్పడటానికి ప్రేరణ కలిగిస్తాయి. ఈ నెలాఖరు నుంచి రైతులు మామిడి చెట్టుకు నీరుపెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే పూతకు బదులు ఆకు ఇగురువచ్చి పంటను కోల్పోవలసి వస్తుంది.