News August 3, 2024

భూ రెవెన్యూ చట్టాలతో నష్టపోయింది ముస్లింలే: అక్బర్

image

TG: నిజాం పాలన ముగిసిన అనంతరం ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివిధ రెవెన్యూ చట్టాల వల్ల ముస్లింలే ఎక్కువగా నష్టపోయారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఐఎస్‌బీ, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల భవనాలన్నింటినీ వక్ఫ్ బోర్డు స్థలాల్లోనే కట్టారు. ఐటీ పార్కు కోసం ల్యాంకో సంస్థకు భూమి ఇస్తే అందులో ఇళ్లు నిర్మించింది. చంచల్‌గూడ జైల్లోనూ 30 ఎకరాల భూమి వక్ఫ్‌దే’ అని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 8, 2025

మూవీ ముచ్చట్లు

image

✦ ఈ నెల 12నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’