News August 19, 2024
లేటరల్ ఎంట్రీ.. తెచ్చింది కాంగ్రెసే: ప్రభుత్వ వర్గాలు

కాంగ్రెస్ నేతృత్వంలోని UPAనే మొదట లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వీరప్ప మొయిలీ (కాంగ్రెస్) సారథ్యంలోని రెండో పరిపాలనా సంస్కరణ కమిషన్ దీనికి గట్టిగా మద్దతిచ్చిందని పేర్కొన్నాయి. పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, సిటిజన్ ఫ్రెండ్లీనెస్ పెంచేందుకు సంస్కరణలు చేపట్టాలని కమిషన్ నొక్కి చెప్పిందన్నాయి. కొన్ని పదవులకు ప్రత్యేక నైపుణ్యాలు, విజ్ఞానం అవసరమే అన్నాయి.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


