News December 26, 2024

Latest Data: ఓటింగ్‌లో మహిళలే ముందు

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 65.78% మంది అర్హ‌త క‌లిగిన మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు తాజా గ‌ణాంకాల ద్వారా వెల్ల‌డైంది. పురుషులు 65.55% మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. త‌ద్వారా వ‌రుస‌గా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పురుషుల కంటే మ‌హిళ‌లే అత్య‌ధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయ‌డం గ‌మ‌నార్హం.

Similar News

News October 25, 2025

AIIMS రాయ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

image

<>AIIMS <<>>రాయ్‌పూర్ 29 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతగల అభ్యర్థులు ఎల్లుండి వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in

News October 25, 2025

హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్?

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్‌లింక్‌కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.

News October 25, 2025

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

image

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.