News October 27, 2024
2 నుంచి సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ జర్నీ

పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం NOV 2 నుంచి పునః ప్రారంభం కానుంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు ₹2,000, పిల్లలకు ₹1,600గా నిర్ణయించారు. వెళ్లి రావడానికి పెద్దలకు ₹3,000, పిల్లలకు ₹2,400 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 7997951023, 9848540371, 9848125720 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
Similar News
News February 9, 2026
మున్సిపోల్: సాయంకాలానికి అంతా SILENT

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, BJP నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, BRS నుంచి కేటీఆర్, హరీశ్ రావు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మొత్తం 2,982 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13 కౌంటింగ్ నిర్వహించనున్నారు.
News February 9, 2026
పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

పూజా ద్రవ్యాలను గౌరవించాలి. అందులో ఉపయోగించే గంట, శంఖం, తమలపాకులతో పాటు ఏ వస్తువులనూ నేరుగా నేలపై ఉంచకూడదు. వీటిని పీఠంపై లేదా ఓ పళ్లెంలో ఉంచాలి. అలాగే, భగవంతునికి సమర్పించే పువ్వుల రెక్కలను విడదీసి పూజించడం నిషిద్ధం. పువ్వును వికసించిన రూపంలోనే అర్పించాలి. పూజా సమయంలో శక్తివంచన ఉండకూడదు. ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు. కేవలం కుడిచేతితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.
News February 9, 2026
క్యారెట్తో ఎన్ని ప్రయోజనాలో?

క్యారెట్ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటిచూపును, విటమిన్-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, విటమిన్-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా, ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.


