News November 8, 2024

రోహిత్‌శర్మ నుంచి అది నేర్చుకున్నా: సూర్య

image

ఆటలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన మన మనస్తత్వం మార్చుకోవద్దని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ఆ విషయాన్ని రోహిత్‌శర్మను చూసే నేర్చుకున్నానని సూర్య చెప్పారు. రోహిత్ గ్రౌండ్‌లో ఎలా ఉంటారో తాను గమనిస్తూ ఉంటానన్నారు. అందరూ హార్డ్‌వర్క్ చేస్తారని, కొన్నిసార్లు కలిసొస్తే, కొన్నిసార్లు వర్కవుట్ కాదని సూర్య చెప్పుకొచ్చారు. రేపు సౌతాఫ్రికాతో T20 సిరీస్ ప్రారంభం కానుంది.

Similar News

News December 14, 2025

యూదులే లక్ష్యంగా టెర్రర్ దాడి?

image

ఆస్ట్రేలియా బీచ్‌లో <<18561798>>కాల్పులు<<>> యూదులే లక్ష్యంగా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి 8 రోజులపాటు యూదులు ‘చనుకా(హనుక్కా)’ పండుగ జరుపుకుంటారు. రాత్రి పూట కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం సిడ్నీలోని బాండీ బీచ్‌కు చేరుకున్న 2 వేల మందిపై ఇద్దరు గన్‌మెన్లు ఫైరింగ్ జరిపారు. ఇది యూదులపై ఉగ్రవాదులు జరిపిన నీచమైన దాడి అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ మండిపడ్డారు.

News December 14, 2025

సర్పంచ్ ఎన్నికలు.. ఒక్క ఓటు తేడాతో విజయం

image

TG: వికారాబాద్ జిల్లా మర్పల్లి మం. రాంపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్‌గా చంద్రశేఖర్ 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సూర్యాపేట (D) కోదాడ మం. కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారు హాజీనాయక్, NZB (D) మోపాల్ మం. కులస్పూర్ తండాలో కాంగ్రెస్ బలపరిచిన లలితా భాయి 5 ఓట్ల తేడాతో గెలిచారు.

News December 14, 2025

కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

image

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.