News May 11, 2024

ఎల్లుండి సెలవు ఇవ్వాల్సిందే: ఈసీ

image

TG: ఎన్నికల పోలింగ్ జరిగే మే 13వ తేదీన అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ‘సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయి. ప్రచార సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదు. జూన్ 1వ తేదీ సా.6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుంది. 160 కేంద్ర బలగాలు, 60వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News December 29, 2025

ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్‌స్టాప్!

image

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.

News December 29, 2025

ALERT: పెరగనున్న కార్ల ధరలు!

image

కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి వాహన తయారీ సంస్థలు షాకిచ్చాయి. ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో జనవరి తొలివారంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. సుజుకీ, హ్యుందాయ్, MG, టాటా, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలు మోడల్‌ను బట్టి 1% నుంచి 3% వరకు ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే ఇయర్ ఎండ్ సేల్స్‌లో భాగంగా ఈ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌తో అమ్మకాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

News December 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 111 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
సమాధానం: మహాభారతంలో పాండవుల కోసం అద్భుతమైన మయసభను నిర్మించింది మయాసురుడు. ఈయన గొప్ప అసుర శిల్పి. రామాయణంలో ఈయన రావణుడికి మామగారు. రావణుడి భార్య మండోదరి తండ్రి మయాసురుడే. ఆయన రామాయణ కాలంలో అసురులకు భవనాలు, నగరాలను నిర్మించే శిల్పిగా కూడా ప్రసిద్ధుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>