News May 11, 2024

ఎల్లుండి సెలవు ఇవ్వాల్సిందే: ఈసీ

image

TG: ఎన్నికల పోలింగ్ జరిగే మే 13వ తేదీన అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ‘సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయి. ప్రచార సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదు. జూన్ 1వ తేదీ సా.6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుంది. 160 కేంద్ర బలగాలు, 60వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News February 6, 2026

వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న U19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నారు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. అతడి ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు, 9 ఫోర్లున్నాయి. ప్రస్తుతం 119 పరుగులతో ఆడుతున్నారు. 21 ఓవర్లలో టీమ్ స్కోరు 186-2. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేసి ఔట్ అయ్యారు. U19 WCలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ వైభవ్.

News February 6, 2026

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

image

NIT ఆంధ్రప్రదేశ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎంకామ్, PhD అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పీహెచ్‌డీ అర్హత గలవారికి నెలకు రూ.70వేలు, ఎంబీఏ అర్హతగల వారికి రూ.55,000 చెల్లిస్తారు. బోధన, ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in

News February 6, 2026

శరీరంలో షుగర్ పెంచే ఆహారాలివే..

image

స్వీట్లు, షుగర్ ఎక్కువగా తినడం వల్లే మధుమేహం వస్తుందనేది అపోహే అంటున్నారు నిపుణులు. కొన్ని రోజువారీ ఆహారపు అలవాట్లు కూడా మధుమేహంతో ముడిపడి ఉంటాయంటున్నారు. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, గ్రేనోలా, సిరల్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, కూల్ డ్రింకులు, అన్నం, మైదాతో చేసిన పదార్థాల వల్ల షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వీటిని తక్కువగా తీసుకుంటూ ఆరోగ్యకర జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు.