News November 14, 2024
ఎడమ కంటికి సమస్య.. కుడి కంటికి ఆపరేషన్ చేశారు

UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.
Similar News
News February 10, 2026
భారత్తో మ్యాచ్కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టీ20 వరల్డ్ కప్లో ఈ నెల 15న టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీసీ, బీసీబీ, పీసీబీ, శ్రీలంకతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ నెల 15న యథావిధిగా మ్యాచ్ జరగనుందని ఐసీసీ పేర్కొంది. భారత్తో మ్యాచ్ ఆడాలని <<19097083>>బీసీబీ<<>> రిక్వెస్ట్ చేసిన కాసేపటికే పాక్ ప్రభుత్వం ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
News February 10, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 10, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 10, 2026
లక్ష మార్కు చేరనున్న సెన్సెక్స్?

భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది భారీగా పెరగనున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 1,00,000 దాటే అవకాశముందని తెలిపింది. RBI చర్యలు, పన్ను సంస్కరణలు మార్కెట్లకు మద్దతిస్తున్నాయని తెలిపింది. క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగితే ఇది సాధ్యమేనని పేర్కొంది. అయితే చమురు ధరలు పెరిగితే సెన్సెక్స్ 76,000 వరకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


