News July 5, 2024
పోస్టుల పెంపుతో న్యాయపరమైన చిక్కులు: CMO

TG: గ్రూప్-1 మెయిన్స్ సెలక్షన్ను 1:50 నిష్పత్తికి బదులుగా 1:100కి మారిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తి నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని CMO ప్రకటనలో తెలిపింది. అలాగే పరీక్ష ప్రక్రియ కొనసాగుతున్నందున గ్రూప్-2, 3 పోస్టుల పెంపు సాధ్యపడదని తెలిపింది. ఒకవేళ గ్రూప్-1 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచే అవకాశం ఉన్నా గ్రూప్-2, 3కి అలాంటి సౌకర్యం లేదని పేర్కొంది.
Similar News
News November 6, 2025
వంటింటి చిట్కాలు

* పూరీలు తెల్లగా రావాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయిస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ వస్తాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించేముందు కాసేపు ఎండలో పెడితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
News November 6, 2025
225 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TGలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ పాసై, 18- 30ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. HYD, కరీంనగర్, ఖమ్మం, MBNR, మెదక్, WGL జిల్లాల్లో ఖాళీలున్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి
News November 6, 2025
యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.


