News February 21, 2025
ఇండియాలో లెజెండరీ రాపర్ ఎమినెం కన్సర్ట్?

కోల్డ్ప్లేతో పాటు ఎడ్ షీరన్లు ఇప్పటికే ఇండియాలో కన్సర్ట్స్ నిర్వహించి ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. తాజాగా లెజెండరీ రాపర్ ఎమినెం ఈ ఏడాది ఇండియాలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ముంబైలో ఆయన కన్సర్ట్ ఉంటుందని సమాచారం. దీంతో సంగీత ప్రియులు ఈ ప్రదర్శన కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Similar News
News December 4, 2025
TODAY HEADLINES

➻ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
➻ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం చంద్రబాబు
➻ త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: CM రేవంత్
➻ దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
➻ డాలరుతో పోలిస్తే 90.13కి చేరిన రూపాయి మారకం విలువ
➻ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి
➻ రెండో వన్డేలో భారత్పై సౌతాఫ్రికా విజయం
News December 4, 2025
పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు

TG: భూకబ్జా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో 70 మంది బౌన్సర్లతో వచ్చి ల్యాండ్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారని, అడ్డుకున్న తమపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు FIR ఫైల్ చేశారు. NOV 30న ఘటన జరగగా రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో ఐదుగురిపై తాజాగా కేసు నమోదైంది.
News December 4, 2025
ఈ బౌలింగ్, ఫీల్డింగ్తో వరల్డ్ కప్ నెగ్గగలమా?

వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టు అన్ని విభాగాల్లో టాప్ క్లాస్లో ఉండాలి. ప్రస్తుతం IND బౌలింగ్, ఫీల్డింగ్ చూస్తే WC గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. SAతో 2వ వన్డేలో 350+స్కోర్ చేసినా బౌలర్లు పోరాడలేదు. తొలి వన్డేలోనూ తేలిపోయారు. ఫీల్డింగ్లోనూ లోపాలు కనిపించాయి. WC-2027కు ముందు భారత్ 20 వన్డేలే ఆడనుంది. అప్పట్లోగా ఈ 2 విభాగాల్లో మెరుగవ్వకుంటే WC మరోసారి కలగానే మిగిలే ప్రమాదం ఉంది.


