News March 3, 2025
భక్తులపై చిరుతల దాడులు.. టీటీడీ కీలక నిర్ణయం?

AP: శ్రీవారి భక్తులపై చిరుతల దాడులను అరికట్టేందుకు TTD కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్లోని చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులకు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఆ జంతువుల కదలికలను గుర్తించవచ్చు. అవి జన సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తమై దూరంగా తరమవచ్చు. వాటిని ట్రాప్ చేసి పట్టుకుని సిమ్తో కూడిన రేడియో కాలర్ సిస్టమ్ను అమర్చుతారు.
Similar News
News December 17, 2025
ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.
News December 17, 2025
నేడే మూడో విడత పోలింగ్

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.
News December 17, 2025
ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>


