News March 3, 2025
భక్తులపై చిరుతల దాడులు.. టీటీడీ కీలక నిర్ణయం?

AP: శ్రీవారి భక్తులపై చిరుతల దాడులను అరికట్టేందుకు TTD కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్లోని చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులకు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఆ జంతువుల కదలికలను గుర్తించవచ్చు. అవి జన సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తమై దూరంగా తరమవచ్చు. వాటిని ట్రాప్ చేసి పట్టుకుని సిమ్తో కూడిన రేడియో కాలర్ సిస్టమ్ను అమర్చుతారు.
Similar News
News December 19, 2025
మ్యాచ్ రద్దయితే ఫైనల్కు భారత్

అబుదాబీలో భారీ వర్షం కారణంగా భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆసియా కప్ U-19 సెమీఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. కాసేపట్లో అంపైర్లు పిచ్ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పాయింట్ల టేబుల్లో టాప్లో ఉన్న భారత్ ఫైనల్ చేరనుంది. మరో సెమీస్లో బంగ్లా, పాక్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది.
News December 19, 2025
‘వీబీ-జీ రామ్ జీ’తో కనీస వేతనాలకు ముప్పు!

MGNREGA పేరును ‘వీబీ-జీ రామ్ జీ’గా మార్చిన కేంద్రం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. అయితే ఈ పథకం వల్ల ప్రైవేటు వ్యక్తులు కూలీలకు అంతకన్నా మెరుగైన వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్లో పథకం నిలిపివేస్తే ప్రైవేటు మోనోపలీ పెరిగి కనీస వేతనాలు దక్కవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రబీ, ఖరీఫ్ వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తీరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
News December 19, 2025
TG SET హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG SET 2025) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ <


