News March 16, 2024
25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలనివ్వండి: రేవంత్ రెడ్డి

APకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని TS CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించండి. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది MLAలు, ఐదుగురు MPలను ఇవ్వండి చాలు. షర్మిలమ్మ పోరాటం చేస్తారు. ఎవరినైనా చొక్కా పట్టి ప్రశ్నిస్తారు. ఎలా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎలా పోలవరం పూర్తికాదో, ఎలా విశాఖ ఉక్కును కొల్లగొడతారో చూసుకుంటారు. కంచె వేసి కాపాడుకుంటారు’ అని అన్నారు.
Similar News
News March 8, 2026
విద్యార్థులకు సూపర్ న్యూస్

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో 21 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు వారంలో 3 రోజులు రాగి జావ ఇస్తున్నారు. మిగిలిన 3 రోజులు పాలను అందించాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీ స్టూడెంట్లకూ పాలు, రాగి జావ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ కోరుతోంది.
News March 8, 2026
అందుకే భారత్కు మినహాయింపు: ట్రంప్

మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పడిందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దాన్ని తగ్గించేందుకే భారత్కు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. దీని వల్ల రష్యాకు ఉపయోగం ఉండదన్నారు. వాణిజ్యంలో భారత్ తమకు కీలక భాగస్వామి అని అన్నారు. అటు ఆయిల్ కొనుగోలులో తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని USకు భారత్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News March 8, 2026
CA ఫలితాలు విడుదల

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ను <


