News June 10, 2024

ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తాం: పట్టాభి

image

AP: ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ నేత పట్టాభిరామ్ అన్నారు. తాము హింసను ప్రేరేపించమని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారని మండిపడ్డారు. కూటమి పార్టీలన్నీ ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాయన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేశ్ రెడ్‌బుక్, ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.

Similar News

News October 6, 2024

INDvPAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

image

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమ్ ఇండియా అమ్మాయిలు నేడు పాకిస్థాన్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్: మునీబా అలీ, గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా, తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్
భారత్: మంధాన, షఫాలీ, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, అరుంధతి, సజన, శ్రేయాంక, శోభన, రేణుక

News October 6, 2024

చంద్రబాబుకు ఇప్పుడు బైబిల్ కావాలి: VSR

image

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో ‘పవిత్ర రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తోంది. పవిత్ర క్రిస్మస్ వస్తుంది‌గా వేషం మార్చాలి. అర్జెంట్‌గా బైబిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్’ అని రాసుకొచ్చారు. బాబువి ఊసరవెల్లి రాజకీయాలు అని ఆయన విమర్శించారు.

News October 6, 2024

ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: <>aptet.apcfss.in<<>>